బొబ్బిలి నియోజకవర్గం: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి నియోజకవర్గం
తేదీ 29-10-2025

గంగన్నపాడు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి నియోజకవర్గంలో “మొంథా తుఫాను” ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు.. తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టు పక్కన ఉన్న చెరువులు నిండిపోవడం వలన గ్రామంలోకి నీరు చేరడం జరిగింది.. గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈరోజు గంగన్నపాడు గ్రామంలో ముంపు ప్రాంతాన్ని సందర్శించి, వారికి కావలసిన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, అధిక వర్షాలు కారణంగా ముంపుకి గురైన పంట పొలాలను కూడా పరిశీలించడం జరిగింది.

ఎమ్మెల్యే గారుతో పాటు ఏఎంసీ చైర్మన్ శ్రీ నర్సుపల్లి వెంకటనాయుడు గారు, తెర్లాం మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ నర్సుపల్లి వెంకటేష్ గారు, శ్రీ మర్రాపు శంకర్రావు గారు, శ్రీ కరణం రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ శ్రీ తాడి పోలి నాయుడు గారు ఉన్నారు.

(PRO, MLA BBL)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *