హైదరాబాద్,పబ్లిక్ టాక్ టీవీ: బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక తన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్లో బుస్సా విజేత అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించబోతోంది. పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు ఈ అవార్డ్స్ ద్వారా సినిమా, టెలివిజన్, వ్యాపారం, ఆరోగ్యం, సేవా రంగం, విద్య, పత్రికా రంగం వంటి విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ అవార్డుల సందర్భంగా పలువురు ప్రముఖులు బుస్సా బాలరాజుకు తమ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థకు చెందిన సమాచార్ భవన్లో **ఎమ్.డి. ప్రియాంక**, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు టెలివిజన్ వర్కర్స్ అండ్ టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు **నాగబాల సురేష్ కుమార్**, నటీనటులు **అశోక్ కుమార్, జె.యల్. శ్రీనివాస్, లహరి, మధు ప్రియ, మాణిక్**, నటి **సూర్యకళ**, దర్శకులు-రచయిత సంఘం అధ్యక్షుడు **ప్రేమ్ రాజ్**, **నరేంద్ర**, తెలుగు సినీ టివి నటీనటుల సంఘం అధ్యక్షుడు **రాజ్ శేఖర్**, రచయిత **వెనిగళ్ళ రాంబాబు**, **సత్యం యాబి మాస్టారు**, **అక్కినేని శ్రీధర్ లక్ష్మి**, **డా. శ్రీరాందత్తి**, **శ్రీరామోజు లక్ష్మి నారాయణ**, **భాస్కర్ల వాసు**, **నరేందర్ రెడ్డి**, **ఆర్.డి.ఎస్. ప్రకాష్** తదితరులు ఉన్నారు.
బుస్సా బాలరాజు మాట్లాడుతూ …బుస్సా విజేత అవార్డ్స్ ద్వారా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మా లక్ష్యం. ప్రతి రంగంలో కృషి చేస్తున్న ప్రతీ వ్యక్తి గౌరవించబడాలి. త్వరలోనే ఈ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తాం,” అని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 9908780059 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.