పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన శ్రీ బీ.ఆర్.నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం వారికీ భక్తులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆయన చిత్తశుద్ధిని చూస్తున్నాం.
పాలనలో తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించి సరికొత్తగా తిరుమల భక్తులకు సేవలు అందించడం సంతోషించే విషయం.
శ్రీవారి భక్తులంతా తిరుమలలో మౌలిక సదుపాయాల కల్పన, అన్నప్రసాదం.. వంటి సౌకర్యాల కూర్పులో సరికొత్త మార్పులు చూస్తున్నారంటే శ్రీ బీ.ఆర్.నాయుడు గారి మార్గదర్శకమే.
మున్ముందు ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ..
ప్రముఖ వ్యాపారవేత్త & సంఘ సేవకులు శ్రీ బైరా దిలీప్ గారు కూడా శ్రీ BR నాయుడు గారిని కలిసి వారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు అభినందనలు తెలియజేయడం జరిగింది .